
వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పేవిలియన్లో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వర్షాకాల సీజన్లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




