CM Sri Revanth Reddy Attended Sri Sitarama Thirukalyana Mahotsavam at Bhadrachalam

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.