
తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPS ని కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని కోరారు.




